ధోనీ రిటైర్మెంట్​పై సీఎస్కే సీఈవో సంచలన కామెంట్స్

-

ఈ ఐపీఎల్‌లో సీఎస్కే ఆడిన ప్రతిమ్యాచ్​లో ధోని రిటైర్మెంట్ గురించే చర్చ అంతా. చివరి వరకు ధోని ఈ ఐపీఎల్​తోనే తన కెరీర్ ముగిస్తాడని అంతా భావించారు. ఈ ఐపీఎల్​ మోకాలి గాయంతో మహేంద్రసింగ్‌ ధోని ఎంత ఇబ్బంది పడ్డాడో తెలిసిందే. వయసు కూడా 42 ఏళ్లకు చేరువ కావడంతో ఈ సీజన్‌తోనే అతను ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించేస్తాడేమో అన్న చర్చ కూడా జరిగింది. కానీ చెన్నైకి అయిదో ట్రోఫీ అందించిన అనంతరం ధోని మాట్లాడుతూ.. కష్టమైనప్పటికీ అభిమానుల కోసం ఇంకో సీజన్‌ ఆడేందుకు ప్రయత్నిస్తానన్నాడు.

తాజాగా సీఎస్కే యాజమాన్యం ధోని రిటైర్మెంట్ గురించి స్పందించింది. మోకాలి గాయం తీవ్రతను బట్టే ఇంకో సీజన్‌ ఆడటంపై తుది నిర్ణయం తీసుకుంటాడని చెన్నై సూపర్‌కింగ్స్‌ సీఈవో విశ్వనాథన్‌ తెలిపాడు. ‘‘తన ఎడమ మోకాలి గాయం విషయంలో వైద్య నిపుణుల సలహా ఆధారంగా ధోని నిర్ణయం తీసుకుంటాడు. వైద్య నివేదికలను అనుసరించి అతను శస్త్రచికిత్స కూడా చేయించుకోవచ్చు. ఏదైనా నిర్ణయం తనదే’’ అని విశ్వనాథన్‌ అన్నాడు. ధోని ప్రత్యామ్నాయాల గురించి ఇప్పటిదాకా తాము ఆలోచించలేదని అతను స్పష్టం చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version