భారీ స్కోరు చేసిన ముంబై.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ కొట్టిన సిక్సర్లు అద్భుతమనే చెప్పాలి. హాప్ సెంచరీకి ముందు రోహిత్ అక్షర్ పటేల్ ను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. మూడు డాట్ బాల్స్ అనంతరం అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు రోహిత్ శర్మ.

ఇవాళ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు రోహిత్ శర్మ. ఢిల్లీ క్యాపిటల్స్ పై 1000 పరుగులు పూర్తి చేసిన రెండో క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. రోహిత్ శర్మ 49, ఇషాన్ కిషన్ 42, హార్దిక్ పాండ్యా 39 పరుగులు చేశారు. చివరి ఓవర్ లో షెఫర్డ్ విధ్వంసమే సృష్టించాడు. వరుసగా 4,6,6,6,4,6 బాది ఏకంగా 32 రన్స్ పిండుకున్నారు. అక్షర్ పటేల్ 2, నోకియా 2, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు 235 రన్స్ చేయాలి. 

Read more RELATED
Recommended to you

Latest news