పింక్ బాల్ టెస్టుకు మానసికంగా సిద్ధం కావాలి : వైస్ కెప్టెన్ బుమ్రా

-

భార‌త్ కు డే అండ్ నైట్ మ్యాచ్ లు ఆడే అనుభ‌వం ఎక్కువ లేద‌ని టీమిండియా టెస్ట్ కెప్టెన్ జ‌స్ప్రీత్ బుమ్రా అన్నారు. పింక్ బాల్ టెస్టు ఆడాలంటే.. త‌ప్ప‌కుండా మాన‌సికంగా సిద్ధంగా ఉండాల‌ని అన్నారు. కాగ శ్రీ‌లంక తో రేపు జ‌ర‌గ‌బోయే రెండో టెస్టు మ్యాచ్ పింక్ బాల్ తో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడ‌నుంది. కాగ ఈ మ్యాచ్ కు టీమిండియా సిద్ధం అవుతుంది. ఈ సంద‌ర్భంగా.. టీమిండియా వైస్ కెప్టెన్ మీడియాతో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో వైస్ కెప్టెన్ జ‌స్ప్రీత్ బుమ్రా ఆసక్తిర వ్యాఖ్య‌లు చేశారు.

టీమిండియాకు డే అండ్ నైట్ మ్యాచ్ లు ఆడ‌టంలో ఎక్కువ అనుభవం లేద‌ని అన్నారు. ఇప్పుడు డే అండ్ నైట్ మ్యాచ్ ఆడ‌టానికి ఆట‌గాళ్లు మాన‌సికంగా ప‌లు మార్పులు చేసుకోక త‌ప్ప‌ద‌ని అన్నారు. దీని బ‌ట్టే తుది జ‌ట్టు ఉంటుంద‌ని అన్నారు. కాగ శ్రీ‌లంక‌, టీమిండియా మ‌ధ్య రెండో టెస్టు రేపు బెంగ‌ళూర్ లోని చిన్న స్వామి స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. కాగ ఈ మ్యాచ్ కు క‌రోనా త‌ర్వాత మొద‌టి సారి వంద శాతం శామ‌ర్థ్యంతో ప్రేక్షకుల‌ను బీసీసీఐ అనుమ‌తి ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news