పాక్ ఆట‌గాడు రిజ్వాన్ పై పెరుగుత‌న్న ప్ర‌శంస‌లు

-

దాయాది దేశ మైన పాకిస్థాన్ జ‌ట్టు ఆట‌గాడు మ‌హ్మ‌ద్ రిజ్వాన్ పై ప్ర‌శంస‌లు పెరుగుతున్నాయి. రిజ్వాన్ టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్ లో అద‌ర‌కొట్టాడు. అయితే తాజాగా పాక్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ రిజ్వాన్ పై భార‌త మాజీ ఆట‌గాడు వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ధైర్యానికి, దృఢ సంక‌ల్పానికి గొప్ప ఉద‌హార‌ణ రిజ్వాన్ అని వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ అన్నాడు. అంతే కాకుండా రిజ్వాన్ త‌న ఆరోగ్యం కంటే త‌న దేశం గురించి ఆడ‌టానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చాడ‌ని అన్నాడు.

అయితే టీ ట్వంటి ప్రపంచ క‌ప్ లో భాగంగా బుధ వారం రోజు రాత్రి ఆస్ట్రేలియా పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు ముందు పాక్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ రిజ్వాన్ తో పాటు షోయాబ్ మాలిక్ అనారోగ్యం తో బాధ ప‌డ్డాడు. దీంతో ఈ మ్యాచ్ రిజ్వాన్ సెమీ ఫైనల్ ఆడుతాడా.. లేదా.. అనే అనుమానం ఉండేది. అయితే రిజ్వాన్ ఫ్లూ తో బాధ ప‌డుతున్న త‌న జ‌ట్టు కోసం ఆడాడు. అయితే ఈ మ్యాచ్ లో రిజ్వాన్ అద్భుతంగా ఆడాడు. అయితే ఈ మ్యాచ్ లో పాక్ ఓడినా.. రిజ్వాన్ పై ప్ర‌శంస‌లు మాత్రం పెరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news