తొలి టెస్ట్ లో పట్టుబిగించిన భారత్.. రెండో రోజు శ్రీలంక స్కోర్ 108/4

-

మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పట్టు బిగిస్తోంది. భారత బౌలింగ్ దాటికి శ్రీలంకన్ బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. రెండో రోజు ఇన్నింగ్స్ డిక్లెర్ తరువాత శ్రీలంక బ్యాటింగ్ ఏ మాత్రం ఛాలెంజింగ్ గా సాగలేదు. భారత బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక  108/4 స్కోర్ చేసింది. ఇంకా 466 పరుగులు వెనకబడి ఉంది. అద్భుతం జరిగితే తప్పా.. శ్రీలంకను ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం లేదు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా… రవీంద్ర జడేజా, బూమ్రా తలో వికెట్ తీశారు. కరుణ రత్నే, తిరుమన్నే, ఎంజెలో మాథ్యూస్, ధనుంజయ డిసిల్వా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ప్రస్తుతం నిస్సంక, అసలంక క్రీజులో ఉన్నారు. 

రెండో రోజు భారత బ్యాటింగ్ జోరుగా సాగింది. రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్ కారణంగా భారత్ భారీస్కోర్ సాధించింది. ఏడో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజాకు లోయర్ ఆర్డర్ నుంచి పూర్తి సహకారం లభించింది. 228 బాల్స్ లో 3 సిక్సులు, 17 ఫోర్లతో 175 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత ఇన్నింగ్స్ లో హనుమ విహారి 58, విరాట్ కోహ్లీ 45, రిషబ్ పంత్ 96, అశ్విన్ 61 పరుగులు చేశారు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 574/8 వద్ద ఇన్సింగ్స్ డిక్లెర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version