తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్

-

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ నేడు తన భార్య, కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ విరామ దర్శన సమయం లో కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు సూర్య కుమార్ యాదవ్. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యను సత్కరించారు.

అనంతరం ఆయనకి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక ఆలయం డేటా అభిమానులు సూర్య కుమార్ తో ఫోటోలు దిగడానికి పోటీపడ్డారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలిసారి టెస్టులలోనూ చోటు దక్కించుకున్నారు సూర్య కుమార్ యాదవ్. అయితే తొలి మ్యాచ్ లో పెద్దగా రాణించకపోవడంతో రెండో టెస్టులో బెంచ్ కే పరిమితం అయ్యారు. ఇక రెండో టెస్టు మూడు రోజులలోనే ముగియడంతో విశ్రాంతి లభించింది. దీంతో ఆటగాళ్లు స్వస్థలాలకు వెళ్ళగా సూర్య తిరుమల కి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version