టీమిండియా కి ఆల్ ది బెస్ట్ చెప్పిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు

-

టీమిండియా కి ఆల్ ది బెస్ట్ చెప్పిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఓటమి లేని జట్టుగా ప్రపంచకప్ ను ముద్దాడాలని ఆకాంక్షించారు రాయుడు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా ప్రపంచ కప్ మరోసారి గెలవాలని కోరుకుంటున్న, ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ప్రతి భారతీయుడు అదే కోరుకుంటున్నారు.
ఈ ప్రపంచ కప్ లో భారత జట్టు ప్రదర్శన అత్యద్భుతంగా ఉందన్నారు.

ఓటమి లేకుండా ఫైనల్ కి వచ్చింది. గడిచిన 10 సంవత్సరాలుగా మన ఫాస్ట్ బౌలింగ్ ఉత్తమ గణాంకాలను నమోదు చేస్తుంది.
బ్యాటింగ్ ,ఫీల్డింగ్ విభాగాల్లో చాలా పటిష్టం గా ఉన్నాం. T20 మ్యాచ్ లలో ఆడిన అనుభవం ప్రతి ప్లేయర్ కి ఉపయోగ పడుతుంది. ప్రత్యర్థి జట్టు 300 పై న స్కోర్ కొట్టినా భయపడేది లేదు. క్రికెట్ లో పగలు , ప్రతీకారాలు ఉండవు గాని, ప్రత్యర్థి మీద ఆధిపత్యం ప్రదర్శించాలని కోరిక ఎప్పుడు ఉంటుంది. ప్రత్యర్ధి జట్టు ను గౌరవిస్తూ నే ఆధిపత్యం ప్రదర్శిస్తారు. ఆస్ట్రేలియా చేతి లో 2003 ఓటమికి ఈ 2023లో భారత్ సమాధానం చెప్పి తీరుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version