రాణించిన విరాట్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?

-

టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ సౌతాఫ్రికా, భారత్ మధ్య జరుగుతుంది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 9 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 3 వికెట్లు పడి కష్టాల్లో ఉన్న సమయంలో భారత జట్టు స్కోరును విరాట్ కోహ్లీతో కలిసి ముందుకు నడిపించారు. 31 బంతుల్లో 47 రన్స్ చేశాడు. 

విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ 76 పరుగులు చేశాడు. చివరల్లో శివందూబే కూడా 16 బంతుల్లో 27 పరుగులు చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version