క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త.. నేడే ఐపీఎల్ -2022 షెడ్యూల్ విడుదల

-

క్రికెట్‌ ఫ్యాన్స్‌ కు అదిరిపోయే శుభవార్త. ఇవాళే.. ఐపీఎల్‌ 2022 టోర్నీ పూర్తి షెడ్యూల్‌ విడుదల కానుంది. ఇవాళ సాయంత్రం పూట… ఐపీఎల్‌ 2022 షెడ్యూల్‌ ను విడుదల చేయనుంది బీసీసీఐ పాలక మండలి. కాగా.. ఫిబ్రవరి 25 వ తేదీన జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో లీగ్ షెడ్యూల్ పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుందని బీసీసీఐ ఆ రోజే ప్రకటించింది. మే 29వ తేదీన అహ్మదాబాదులో జరగనున్న ఫైనల్ మ్యాచ్ తొలి ముగియనుంది. ఐపీఎల్‌ జట్లను ఎప్పుడు లేని విధంగా రెండు గ్రూపులు గా విభజించింది బీసీసీఐ.

దీంతో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లు రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచాయి. రెండు కొత్త జట్లు, లక్నో సూపర్ జెయింట్స్ మరియు గుజరాత్ టైటాన్స్ వేర్వేరు గ్రూపులలో చోటు దక్కించుకున్నాయి. ఈ సారి మొత్తం 70 ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news