కెప్టెన్సీకి ధోని గుడ్‌ బై..విరాట్‌ కోహ్లీ ఎమోషన్‌ పోస్ట్

-

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్లు నిన్న ప్రకటించాడు. ఈ మేరకు నిన్న మహేంద్ర సింగ్ ధోనీ అధికారిక ప్రకటన చేశాడు. ఇక తన కెప్టెన్సీ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగిస్తూ.. ధోని తప్పుకున్నాడు.

దీంతో అందరూ షాక్‌ కు గురయ్యారు. అయితే.. తాజాగా ఐపీఎల్‌ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్‌ ధోని తప్పుకోవడం పై టీమిండియా మాజీ సారధి విరాట్‌ కోహ్లీ స్పందించాడు.

గతంలో ఐపీఎల్‌ సందర్భంగా తాను ధోనితో దిగిన ఫోటోను ఆయన పోస్టు చేశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ధోని అత్యుత్తమంగా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడని విరాట్‌ కోహ్లీ కొనియాడారు. ఎల్లో కరల్‌ జెర్సీలో దిగ్గజ సారథిగా కొనసాగాడని.. ధోని చరిత్రను అభిమానులు ఎప్పటికీ.. మర్చి పోబోరని చెప్పాడు. ధోని అంటే తనకు ఎప్పుడూ అమితమైన ప్రేమ, గౌరవం ఉంటుందని చెప్పాడు విరాట్‌ కోహ్లీ.

Read more RELATED
Recommended to you

Latest news