ఒలింపిక్స్ : నిరాశపరిచిన లక్ష్య సేన్..!

-

ప్యారిస్ ఒలంపిక్స్ లో భారత బ్యాట్మెంటన్ ఈసారి ఖాళీ చేతులతో తిరిగేస్తుంది. బ్యాట్మెంటన్ లో భారత్ తరపున పోరులో నిలిచిన లక్ష్య సేన్ కాంస్య పోరులో ఓడిపోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల సింగిల్స్ లో అద్భుత ప్రదర్శనతో సెమీస్ లోకి వచ్చిన లక్ష్య సేన్ అక్కడ ఓడిపోయి కాంస్య పోరుకు వచ్చాడు. అయితే తాజాగా ఈ కాంస్య మ్యాచ్ లో కూడా మలేషియన్ చేతిలో ఓడిపోయాడు.

సెమీస్ మదిలో మొదటి సెట్ లో అద్భుతంగా ఆడిన లక్ష్య సేన్ 21-13 తో విజయం సాధించాడు. ఆ తర్వాత రెండో సెట్ ను కూడా అదే విధంగా ప్రారంభించిన లక్ష్య సేన్ 8 పాయింట్ల ఆధిక్యం సంపాదించి ఆ తర్వాత 16-21 తేడాతో సెట్ ను కోల్పోయాడు. ఇక మూడో సెట్ లో వరుస తప్పిదాలు చేస్తూ సులువుగా పాయింట్స్ ఇచ్చేసిన లక్ష్య సేన్ 11-21 తేడాతో ఓడిపోయి 1-2 తేడాతో మ్యాచ్ తో పాటుగా మెడల్ కూడా మలేషియన్ కు సమర్పించుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version