కాసేపట్లో ఉప్పల్ మైదానంలో మ్యాచ్..!

-

హైదరాబాదులో ఉప్పల్ మైదానంలో రాత్రి 7:30 గంటలకి సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాట్ జరగబోతోంది. మొదటి మ్యాచ్ లో ఓడిపోవడంతో ఈసారి ఎలా అయినా నెగ్గాలి అని నిర్ణయంతో ఉన్నారు. మరోవైపు ఈ సీజన్ హోమ్ గ్రౌండ్ లో జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో హైదరాబాద్ జట్టు గెలిచి తీరాలని ఆటగాళ్లు కసితో ఉన్నారు ఈ క్రమంలో మ్యాచ్ చూసేందుకు మైదానానికి వెళ్లే అభిమానులకి హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలని ఇచ్చారు.

స్టేడియంలోకి ఎటువంటి వస్తువులను తీసుకురాకూడదని సిగరెట్ లైటర్ అగ్గిపెట్టె లాప్టాప్ లు బ్యానర్లు, బ్యాటరీలు హెల్మెట్లు పర్ఫ్యూమ్స్ ఇటువంటివి కూడా తీసుకురాకూడదని కెమెరాలు, పెన్నులు బయటకి లోపలికి తీసుకురాకూడదని బయట తినుబండారాలు వాటర్ బాటిల్స్ ని స్టేడియం లోకి తీసుకురాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మ్యాచ్ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 2800 పోలీస్ సిబ్బందితో 360 సీసీ కెమెరాలతో నిఘాని ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news