హైదరాబాద్ క్రికెట్‌ ఫ్యాన్స్​కు బ్యాడ్‌ న్యూస్‌.. ఉప్పల్‌లో నో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌!

-

టీమ్ ​ఇండియా గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు ఆడేందుకు 9 వేదికలను బోర్డు ఖరారు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్​​-పాకిస్థాన్​ మ్యాచ్‌ చెన్నై వేదికగా ఆక్టోబర్‌ 15న జరగనున్నట్లు తెలిసింది. మొదటగా అహ్మదాబాద్‌ వేదికగా ఈ హైవోల్టేజ్​ మ్యాచ్‌ నిర్వహించాలని బీసీసీఐ భావించినా.. భద్రత కారణాల దృష్ట్యా.. మరోవైపు పాకిస్థాన్​ క్రికెట్‌ బోర్డు కూడా తమ జట్టు అహ్మదాబాద్‌ వేదికగా ఆడేందుకు సముఖత చూపలేదని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది.

మరోవైపు వన్డే వరల్డ్​ కప్​ 2023లోనూ పాక్​-భారత్​ సమరాన్ని హైదరాబాద్ క్రికెట్​​ ప్రియులు మిస్ కానున్నట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ అభిమానులకు ఇది బ్యాడ్‌ న్యూస్‌. వన్డే ప్రపంచ కప్‌ కోసం బీసీసీఐ షార్ట్‌ లిస్ట్​ చేసిన వేదికల లిస్ట్​లో హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం ఒక్కటి. అయితే ఉప్పల్‌లో మాత్రం టీమ్​ఇండియా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. టీమ్​ఇండియా మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ సిద్ధం చేసిన డ్రాఫ్ట్​ షెడ్యూల్‌లో హైదరాబాద్‌ పేరు లేనట్లు సమాచారం అందింది. వేరే జట్లకు సంబంధించిన లీగ్‌ మ్యాచ్‌లు ఈ మైదానంలో జరిగే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version