అమిత్ షాపై వైవీ సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్..కేంద్రమే అవినీతి చేసింది !

-

అమిత్ షా వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్ లో పడిందని నిప్పులు చెరిగారు వైవీ సుబ్బారెడ్డి. పసుపు కండువా మార్చి కాషాయ చొక్కాలు వేసుకున్న వాళ్ళు చెప్పిన మాటలను అమిత్ షా పలకడం దారుణం అని మండిపడ్డారు. చిత్తశుద్ధితో నడుస్తున్న ప్రభుత్వంపై అమిత్ షా నిందలు వేశారని ఆగ్రహించారు.

తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి కేంద్రం ఏం చేసిందో చెప్పి అప్పుడు బీజేపీ ఉత్సవాలు జరుపు కుంటే బాగుండేదని.. 2014-19మధ్య జరిగిన అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందన్నారు. 2014ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయో అమిత్ షా చెప్పాలని ఫైర్‌ అయ్యారు వైవీ సుబ్బారెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కనీసం ఒక్క మాటైన చెప్పకుండా 20 పార్లమెంట్ సీట్లు ఇవ్వండని అడుగుతున్నారని మండిపడ్డారు వైవీ సుబ్బారెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version