పీవీ సింధుకు షాక్.. ఆ టోర్నీ నుంచి ఔట్

-

 భారత స్టార్ షట్లర్ పివి సింధుకు మరోసారి నిరాశ ఎదురైంది. 2025 ఆసియా ఛాంపియన్​షిప్​ నుంచి ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఛాంపియన్ షిప్ లో తొలి మ్యాచ్​లో నెగ్గిన సింధు రెండో రౌండ్​లో ఓటమి పాలైంది. జపాన్​కు చెందిన యమగుచి చేతిలో 12-21, 21-16, 16-21 తేడాతో సింధు పరాజయం చూసింది. ఓటమితో సింధు ఆసియా ఛాంపియన్​షిప్ టోర్నమెంట్​ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

జపాన్​కు చెందిన యమగుచితో సింధు గురువారం రోజున రెండో రౌండ్​లో హోరాహోరీగా తలపడింది.  ఈ మ్యాచ్​లో తొలి నుంచి యమగుచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. మొదటి సెట్​లో భారీ తేడా 12-21తో యమగుచి సింధుపై నెగ్గింది. ఇక రెండో సెట్ లో సింధు కమ్​బ్యాక్ ఇస్తూ.. ప్రత్యర్థికి సవాల్ విసింది. అలా రెండో రౌండులో ఇద్దరి మధ్య కాసేపు హోరాహోరీగా పోరు సాగింది. ఫలితంగా రెండో సెట్​​ను సింధు 21-16తో దక్కించుకుంది. దీంతో ఫలితం కోసం మూడో సెట్ ఆడాల్సి రావడంతో చివర్లో యమగుచి 16-24 తేడాతో నెగ్గి మ్యాచ్​ సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news