IND VS ENG: టీమిండియాకు షాక్.. మూడో టెస్ట్‌ నుంచి వైదొలిగిన అశ్విన్

-

మూడో టెస్టులో టీం ఇండియాకు షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగారు. ఆయన కుటుంబంలో తలెత్తిన వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కారణంగా ఆయన ఇంటికి వెళ్లినట్లు బీసీసీఐ ట్విట్టర్ లో తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఆయనకు అండగా ఉన్నామని పేర్కొంది. కాగా…. రాజ్కోట్ లో జరుగుతున్న మూడో టెస్టులో అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే.

Ravichandran Ashwin Withdraws From Test Series Vs England Immediately Due To Family Emergency

అయితే..రవిచంద్రన్ అశ్విన్ రాజ్కోట్ టెస్టు నుంచి అత్యవసరంగా వైదొలగి ఇంటికి వెళ్లడం వెనుక కారణం ఏంటన్న చర్చ నెట్టింట నడుస్తోంది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల అందుకు గల కారణాన్ని వెల్లడించారు. ‘అశ్విన్ తల్లి వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆమెతో ఉండేందుకే ఆయన రాజ్ కోట్ టెస్టు నుంచి హుటా హుటిన ఇంటికి వెళ్లారు’ అని ట్వీట్ చేశారు. ఈ టెస్ట్ లో మిగిలిన మూడు రోజులపాటు అశ్విన్ ఇక ఆడరని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news