ధోని గురించి నాకేం తెలుసు…? అతన్నే అడగండి…!

-

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎప్పుడు తప్పుకునే అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు అనేక చర్చలు జరుగుతున్నాయి. రోజుకో చర్చ దీని మీద ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. గత ఏడాది ప్రపంచకప్ సెమి ఫైనల్ తర్వాత అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత అతను ఐపిఎల్ కి రెడీ అయ్యాడు గాని అంతర్జాతీయ క్రికెట్ గురించి చెప్పలేదు.

తాజాగా ఈ ప్రశ్న రోహిత్ శర్మకు ఎదురు కావడంతో అతనికి చికాకు వచ్చింది. నాకేం తెలుసు అతన్నే అడగండి అంటూ ఫైర్ అయ్యాడు. తాజాగా సోషల్ మీడియాలో అతను అభిమానులతో మాట్లాడాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ సందర్భంగా ధోని గురించి అడగగా… ఎంఎస్ ధోని క్రికెట్ ఆడనప్పుడు, అతను పూర్తిగా రాడార్ నుండి బయటకు వెళ్తాడని చెప్పిన రోహిత్…

అతను ఎవరికి కనిపించడని వివరించాడు. ఈ విషయం గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, మీరు నేరుగా అతని వద్దకు వెళ్ళవచ్చు, అతను రాంచీలోనే ఉంటాడని మీకు తెలుసని కాస్త అసహనంగా మాట్లాడాడు. కాని మీరు ఇప్పుడు వెళ్ళలేరు కాబట్టి లాక్ డౌన్ అయిన తరువాత, మీరు కారు, బైక్ లేదా ఫ్లైట్ తీసుకొని అతని వద్దకు వెళ్లి, ‘మీరు ఏమి చేయబోతున్నారు? మీరు ఆడుతారా లేదా?’ అడగాలి అని అతను సూచించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news