WPL 2023 : RCB కెప్టెన్‌గా స్మృతి మంధాన

-

ఉమెన్స్ ఐపీఎల్ నుంచి మరో బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఉమెన్స్ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ టీమ్ కు టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మందాన కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఐపిఎల్ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్ లో ఐదు జట్లు పోటీ పడుతుండగా ఇటీవల ప్లేయర్ వేలం పూర్తయింది. ఈ మెగా వేలంలో మందనాను ఆర్.సి.బి రూ. 3.4 కోట్ల ధరకు కొనుగోలు చేసింది.

కాగా ఆమెకు సారథ్య బాధ్యతలు అప్పగిం చేందుకు సిద్ధమైంది. ఆర్ సి బి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుతం కెప్టెన్ తో మందనా కెప్టెన్ గా నియమితురాలు అయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది మేనేజ్మెంట్. స్మృతి మందాన కు ఆల్ ది బెస్ట్ చెబుతు వీరిద్దరూ ఇచ్చిన సందేశానికి సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో ఆర్ సి బి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version