క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్..ఐపీఎల్ తరహాలోనే మరో టోర్నీ

-

క్రికెట్ లవర్స్ లకు అదిరిపోయే శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే .. కొత్త t20 లీగ్ ను దక్షిణాఫ్రికా బోర్డు తాజాగా ఒక ప్రకటన చేసింది. మూడు నుంచి నాలుగు వారాల పాటు జరిగే ఈ నీవు లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి అని… మొత్తం 33 మ్యాచ్ ఆడతాయి అని దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటన చేసింది. ప్రతి టీం లో ఐపీఎల్ తరహాలోనే నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉంటారని స్పష్టం చేసింది దక్షిణాఫ్రికా బోర్డు.

2023 సంవత్సరం జనవరి మాసం లో తొలి సీజన్ లో ప్రారంభిస్తామని తెలిపింది. ఆటగాళ్ల వేలం అలాగే లీ నిర్వహణ వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేసింది దక్షిణాఫ్రికా బోర్డు. కాగా.. ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చాలా విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కారణంగా కోట్లల్లో లాభాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. దక్షిణాఫ్రికా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఐపీఎల్‌ 15 వ సీజన్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news