మహబూబ్ నగర్ జిల్లాలో జూరాలకు భారీగా వరద పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు జూరాలకు భారీగా వరద పెరుగుతోంది. ఈ తరుణములోనే 10 గేట్స్ ఎత్తివేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో జూరాలకు ఇన్ ఫ్లో 97 వేల క్యూసెక్కులు నమోదు అయ్యాయి. అవుట్ ఫ్లో 88 వేల 835 క్యూసెక్కులు నమోదు అయ్యాయి.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు నమోదు అయ్యాయి. ప్రస్తుత నీటిమట్టం..317.550 మీటర్లు అయ్యాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు నమోదు అయ్యాయి. ప్రస్తుత నీటి సామర్థ్యం 7.740 టీఎంసీలు అయ్యాయి. నాలుగు యూనిట్లలో 156 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.