బాక్సర్ లవ్లీనా అద్భుత విజయం.. భారత్‌కు మరో పతకం ఖాయం

-

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయంగా కనిపిస్తోంది. భారత బాక్సర్ lovlina లవ్లీనా సెమీస్‌కు దూసుకెళ్లారు. బాక్సింగ్ క్వార్టర్స్‌లో చైనీస్ తైపీ బాక్సర్ పై లవ్లీనా అద్భుత విజయం సాధించారు. 69 కిలోల విభాగంలో నీన్ చిన్ చైన్‌పై 4-1 తేడాతో భారత బాక్సర్ లవ్లీనా గెలుపొందారు. ఈ గెలుపుతో ఒలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసుకున్నారు. సెమీస్‌లో గెలిచినా, ఓడినా పతకం గ్యారెంటీగా దక్కుతుంది.

lovlina

కాగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైనప్పటినుంచే లవ్లీనా బాక్సింగ్‌లో అదరగొడుతున్నారు. గ్రూప్, క్వాలిఫైయింగ్, ప్రీక్వార్టర్స్, క్వార్టర్స్‌లో వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ప్రీకార్టర్స్‌లో జర్మన్ బాక్సర్‌ను లవ్లీనా 3-2తో ఓడించారు. దాంతో ఆమె క్వార్టర్స్‌కు చేరారు. క్వార్టర్స్‌లో కూడా అద్భుత ప్రదర్శన కనబర్చి సెమీస్‌కు చేరుకున్నారు. సెమీస్‌లో కూడా సత్తా చాటాలని లవ్లీనా భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version