టీమిండియాకు గుడ్‌ న్యూస్..టీ20ల్లోకి రోహిత్‌, కోహ్లీ !

-

జూన్ లో జరిగే టి20 వరల్డ్ కప్ ముందు భారత జట్టుకో గుడ్ న్యూస్. గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉంటున్న రోహిత్, కోహ్లీ…. తాము WC కు అందుబాటులో ఉంటామని బీసీసీఐకి సమాచారం ఇచ్చారు.

Virat Kohli and Rohit Sharma should be picked in Indian squad for T20 World Cup 2024

కాగా, ఆఫ్గాన్ తో టి20 సిరీస్, ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్లకు ఇవాళ జట్లను సెలెక్షన్ కమిటీ ప్రకటించనుంది. గాయాలతో టీ20 సిరీస్ కు సూర్య, హార్దిక్ దూరం కాగా…. సిరాజ్, బుమ్రాకు రెస్ట్ ఇవ్వనుంది.

కాగా, కొత్త సంవత్సరం మొద‌లైన 4 రోజుల్లోనే టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వన్ గా సౌత్ ఆఫ్రికా గ‌డ్డ‌పై అడుగుపెట్టిన రోహిత్ సేన కీల‌క‌మైన కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన చివరి టెస్టులో చిరస్మ‌ర‌ణీయ విజ‌యం సాధించింది. రెండు టెస్టుల‌ సిరీస్‌ను స‌మం చేసి 12 కీల‌క పాయింట్లు సాధించింది. దాంతో, ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్-25 టేబుల్ లో మ‌ళ్లీ మొదటి స్థానానికి చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version