కింగ్ ఈజ్ బ్యాక్.. ఐపీఎల్ కోసం ఇండియా వచ్చేసిన విరాట్ కోహ్లి

-

ఐపీఎల్ 2024 మరో 5 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా జట్ల ప్లేయర్లు ఇప్పటికే ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులుగా అందరి దృష్టి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉంది. అనుష్క శర్మ రెండో డెలివరీ కోసం లండన్ వెళ్లిన విరాట్.. గత కొంతకాలంగా అక్కడే ఉన్నాడు. అకాయ్ కోహ్లీ పుట్టిన తర్వాత తాజాగా విరాట్ ముంబయి ఎయిర్పోర్టులో కెమెరాకు చిక్కాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదివారం ఉదయం విరాట్ ముంబయి ఎయిర్ పోర్టులో న్యూ లుక్తో కనిపించాడు. అకాయ్ కోహ్లీ పుట్టిన తర్వాత లండన్ నుంచి భారత్ వచ్చిన కోహ్లీ తెల్లగడ్డంతో కనిపించాడు. ఈ కొత్త లుక్లో విరాట్ను చూసిన తన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ‘తెల్లగడ్డంతో అకాయ్ డాడీ’ అంటూ క్యాప్షన్ ఇస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విరాట్ను ఎంతో మిస్ అయ్యాం అంటూ ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. భారత్కు వచ్చిన విరాట్ త్వరలోనే ఆర్సీబీ క్యాంప్లో చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news