ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఫైట్ జరగనుంది. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. పంజాబ్ కింగ్స్ సొంత గడ్డ చండీగర్ ముల్లాన్పూర్ లో ఈ మ్యాచ్ నిర్వహించబోతున్నారు.

ముల్లాన్పూర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండగా.. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దైతే లీగ్ స్టేజీలో తొలి స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది. అంటే PBKS ఫైనల్ చేరుకోగా, RCB ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో ఆడుతుంది. కాగా ఈ సారి క్వాలిఫయర్-1, ఫైనల్కు రిజర్వ్ డే లేదు. దీంతో వర్షం రాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.