దృశ్యం సినిమా రిపీట్ అయింది. ప్రియుడితో పారిపోయేందుకు వేరే వ్యక్తిని చంపి.. చీర, పట్టీలు తొడిగి శవాన్ని కాల్చి తాను చనిపోయినట్లు నమ్మించింది వివాహిత. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ – జఖోట్రాలో వివాహిత గీతా అహిర్ (22)కు భరత్ (21) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడి, పారిపోవాలని అనుకున్నారు.

ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న హర్జీభాయ్ సోలంకీ(56) అనే వ్యక్తిని చంపి.. మృతదేహానికి వివాహిత గీత దుస్తులు, పట్టీలు తొడిగి తగలబెట్టారు. ఆ కాలిన శవం చూసిన భర్త గీతా శవమేనని భావించగా.. పోలీసుల విచారణలో అది పురుషుడి డెడ్ బాడీ అని తేలింది. విచారణ జరిపిన పోలీసులు భరత్, గీతాను అరెస్టు చేశారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.