కాంగ్రెస్ లో మంత్రి పదవి… కవిత సంచలన ట్వీట్

-

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై మరోసారి ఫైర్ అయ్యారు కల్వకుంట్ల కవిత. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గులాబీ పార్టీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కల్వకుంట్ల కవిత లేఖ రాసిన తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని ఆంధ్రజ్యోతి పత్రికలో రావడం జరిగింది.

kavitha
kavitha

అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెను చేర్చుకోవడం లేదని.. దీంతో కొత్త పార్టీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాలను నిన్న ఖండించారు కవిత. ఇక ఇప్పుడు మరో కథనం ప్రచురణ అయింది. ఆరుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకువస్తే మంత్రి పదవి ఇస్తారా అని కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ముందు ఆఫర్ పెట్టినట్లు… కొత్త వార్త రాసింది ఆంధ్రజ్యోతి. అయితే దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత. ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ సింపుల్ గా కొట్టి పారేశారు.

Read more RELATED
Recommended to you

Latest news