పూరీ-చార్మీలపై పడ్డ శ్రీరెడ్డి.. మూవీ స్టార్స్ చేసే పనే అది!

-

టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి.. ప్రస్తుతం చెన్నెలో సెటిలైంది. క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ సినీ పెద్దలపై ఆరోపణలు చేసి, ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్దనగ్న ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. నాని, సురేష్ బాబు తనయుడు అభిరామ్, పవన్ కళ్యాణ్ ఇలా అందరిపైనా ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేసింది. అన్నీ చేసిన చిన్నది.. సైలెంట్‌గా కోలీవుడ్‌కు చెక్కేసింది.

అయితే ఈ మధ్య రాకేష్ మాస్టర్ వ్యవహారంతో మళ్లీ వార్తల్లోకి నిలిచిన శ్రీ రెడ్డి కరాటే కళ్యాణి,మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ లాంటి వారిపై విరుచుకుపడింది. కరాటే కళ్యాణి, శ్రీ రెడ్డి, రాకేష్ మాస్టర్ ఇలా అందరూ ఒకరిపై మరొకరు ఫిర్యాదుల చేసుకున్నారు. అయితే వీటిలో కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదులో కదలిక వచ్చినట్టు, శ్రీ రెడ్డికి నోటీసులు అందించినట్టు తెలుస్తోంది.

తాజాగా  శ్రీ రెడ్డి డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, చార్మీలపై పడింది. చార్మింగ్ పూరి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసింది. ఆ వెను వెంటనే.. మూవీ స్టార్స్ అందరూ అన్నం కంటే ఎక్కువగా లిప్‌స్టిక్ తింటారని, ఎవరైతే స్టిక్స్ తింటారో వారికే అవకాశాలు వస్తాయని పరోక్షంగా సెటైర్స్ వేసింది. మరి ఈ కామెంట్లు ఎవరిని ఉద్దేశించి చేసిందో ఆమెకే తెలియాలి. ప్రస్తుతం పూరీ విజయ్‌తో ఫైటర్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. చార్మీ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news