శ్రీదేవి వీపుపై బోణికపూర్ పేరు.. ఏ సందర్భంలో రాసుకుందో తెలుసా..?

-

అతిలోక సుందరి శ్రీదేవి ఈ పేరును ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీదేవి నాలుగు దశాబ్దాల కిందట తెలుగుతో పాటు ఇతర భాషా సినిమాల్లో కూడా అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగింది. శ్రీదేవి ఎన్ని భాషల్లో హీరోయిన్ గా నటించి పాపులారిటీ సంపాదించుకున్న తెలుగు భాషలో మాత్రం శ్రీదేవి క్రేజ్ వేరే రేంజ్ అని చెప్పవచ్చు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అలనాటి హీరోలతో పాటు చిరంజీవి, నాగార్జున లాంటి నెక్స్ట్ జనరేషన్ హీరోలతో కూడా సరిసమానమైన పాత్రలలో నటించి స్టార్ హీరోలకు నేనేమీ తక్కువ కాదు అనేంత క్రేజ్ ను ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో సంపాదించుకుంది. ఇలా టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. బాలీవుడ్ లో కూడా శ్రీదేవి కి అతి తక్కువ కాలంలోనే సూపర్ డూపర్ హిట్లు దక్కాయి. అలా శ్రీదేవి బాలీవుడ్ లో కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. అలా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న క్రమంలోనే శ్రీదేవి నిర్మాత బోనీకపూర్ ప్రేమలో పడింది. ఆమె పెళ్ళికి ముందే గర్భవతి కూడా అయింది. అప్పటికే బోనీకపూర్ కి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. చివరకి బోనికపూర్ కు శ్రీదేవి కి పెళ్లి అయింది.

ఇక ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా బోనికపూర్ సోషల్ మీడియాలో శ్రీదేవి కి సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో శ్రీదేవి వీపుపై బోనీకపూర్ అని రాసి ఉంది. కుంకుమ రంగుతో బోనీకపూర్ అని రాసి ఉంది. 2012 సంవ‌త్స‌రంలో దుర్గా పూజా సంబ‌రాల సంద‌ర్భంగా ఈ పేరును శ్రీదేవి రాయించుకున్నట్లు బోనీకపూర్ తెలియజేశారు. యూపీలోని లోక్నో స‌మీపంలో స‌హారా స‌హార్ ప్రాంతంలో ఈ ఫొటో దిగిన‌ట్టు బోనీకపూర్ తెలియజేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news