సీఎం కేసీఆర్ పై శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు

-

అధికార టీఆర్ఎస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లి శంకరమ్మ మాట్లాడుతూ…మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి లేదా జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న శ్రీకాంతాచారి ప్రభుత్వ పెద్దల గుండెల్లో లేడన్నారు శంకరమ్మ.

2018లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పారని…తాము టిఆర్ఎస్ పార్టీలో ఉన్నామో లేమో కూడా తెలియడం లేదనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ పై అభిమానంతో ఆ పార్టీలో కొనసాగుతున్నానని… విశ్వ బ్రాహ్మణులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాని డిమాండ్ చేశారు శంకరమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version