శ్రీ‌కాంత్ కొడుకుతో `పెళ్లిసంద‌డి` సీక్వెల్‌!

-

`పెళ్లిసంద‌డి`. స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అశ్వినీద‌త్‌, అల్లు అర‌వింద్ తొలిసారి క‌లిసి స‌ర‌దాగా నిర్మించిన చిత్ర‌మిది. శ్రీ‌కాంత్ హీరోగా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్రరావు తెర‌కెక్కించిన ఈ చిత్రం రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా 1996లో విడుద‌లై మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. హీరోగా శ్రీ‌కాంత్ కెరీర్‌ని ఓ మ‌లుపు తిప్పింది. శ్రీ‌కాంత్‌ని స్టార్‌గా నిల‌బెట్టింది. ఇదే చిత్రాన్ని హిందీ, త‌మిళ భాష‌ల్లో రీమేక్ చేశారు. అక్క‌డా సూప‌ర్‌హిట్‌గా నిలిచింది.

దాదాపు 25 ఏళ్ల త‌రువాత ఈ చిత్రానికి సీక్వెల్‌ని చేయ‌బోతున్నారు. ఈ చిత్రంలో హీరోగా న‌టించిన శ్రీ‌కాంత్ త‌న‌యుడు ఈ సీక్వెల్‌లో హీరోగా న‌టించ‌బోతున్నాడు. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్రరావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తెర‌పైకి రానున్న ఈ చిత్రాన్ని గౌరీ రోన‌న్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతోంది. `పెళ్లిసందD` పేరుతో త్వ‌ర‌లో తెర‌పైకి రానున్న ఈ చిత్రాన్ని `బాహుబ‌లి` మేక‌ర్స్ ఆర్కా మీడియాతో క‌లిసి కె. కృష్ణ‌మోహ‌న్ రావు నిర్మించ‌బోతున్నారు.

`పెళ్లిసంద‌డి` మ్యూజిక‌ల్ హిట్‌గా నిల‌వ‌డంతో సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి ఈ సీక్వెల్‌కి కూడా సంగీతం అందించ‌బోతున్నారు. న‌టీన‌టుల, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తి కానున్న ఈ చిత్రాన్నిత్వ‌ర‌లో ప్రారంభించ‌బోతున్నారు. ఈ విష‌యాల్ని సోమ‌వారం చిత్ర బృందం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ `నిర్మ‌లా కాన్వెంట్‌` చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news