నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు.. పది గేట్లు ఎత్తి నీటి విడుదల

-

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తోన్న ఇన్ ఫ్లో తో ప్రాజెక్టు నీటికుండలా మారింది. జలకళ సంతరించుకున్న శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. ప్రాజెక్టు నుంచి నీటిని నీటి పారుదల శాఖ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,64,546 క్యూసెక్కుల వరద వస్తోంది. విద్యుదుత్పత్తి, స్పిల్‌వే ద్వారా 3,45,205 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.70 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా, ఇప్పుడు 213.88 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news