కిర్గిస్థాన్‌లో తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలి: హరీష్ రావు

-

కిర్గిస్థాన్‌లో తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎమ్మెల్యే హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

కిర్గిస్థాన్‌ రాజధాని బిష్క్‌క్‌లోని భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు హరీష్ రావు . ఆ హింసలో పలువురు ఇండియాకి చెందిన స్టూడెంట్స్ గాయపడ్డారని ,మన దేశ విద్యార్థులతో పాటు వివిధ దేశాల విద్యార్థులపై స్థానికులు దాడులు చేయడంతో పరిస్థితి దిగజారిందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని గట్టెక్కడానికి, విద్యార్థుల భద్రతపై వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు భారత విదేశాంగ మంత్రి జైశంకర్, బిష్కెక్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు దౌత్యపరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version