BREAKING: తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. సన్న వడ్లు వేస్తేనే 500 బోనస్

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం మొదలైన క్యాబినెట్ భేటీ దాదాపు మూడున్నర గంటల పాటు సాగింది.ఈసీ కేబినెట్ భేటీకి అంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో కేవలం అత్యవసర అంశాలతో పాటు కీలకమైన విషయాలపై మాత్రమే చర్చించారు.

ధాన్యం కొనుగోళ్లపై డిస్కస్ చేసిన కేబినెట్.. వరి కొనుగోళ్ల బాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని స్పష్టం చేసింది. అయితే ఎన్నికల ముందు ప్రతి క్వింటాలకు 500 బోనస్ అని ప్రకటించిన కాంగ్రెస్ , తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది.సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇక, లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రాష్ట్ర విజభన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో.. దీనిపై డిస్కషన్ జరగలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version