కేటీఆర్‌కు సునీత్ రావు వార్నింగ్.. ట్రోలింగ్ ఆపకపోతే నిజంగా చెప్పులతో కొడతాం!

-

బీఆర్ఎస్ నేతలు కావాలని సోషల్ మీడియాలో కాంగ్రెస్ మహిళ నేతలను ట్రోలింగ్ చేస్తున్నారని మహిళా కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ సునీతారావు మండిపడ్డారు. ఈ ట్రోలింగ్ అంతా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జరుగుతోందని ఆమె ప్రధానంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కేటీఆర్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టిన అనంతరం సునీతారావు మాట్లాడారు.

ఇప్పుడు శాంపిల్ మాత్రమే చూపించామని, ఇక మీదట ఇలాగే చేస్తే మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు దొరికిన ప్రతిచొటా ఇలానే చెప్పులతో కొడతామని హెచ్చరించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు వస్తాయని ఆమె వెల్లడించారు. ఇదిలాఉండగా, మంత్రి కొండా సురేఖను బీఆర్ఎస్ నేతలు ట్రోలింగ్ చేయడం వల్లే సహనం కోల్పోయిన మంత్రి కేటీఆర్ వల్లే సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఇబ్బందులు పడ్డారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఇండస్ట్రీ పెద్దలు ఆమెపై తీవ్రంగా విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version