స్వరూపానంద స్వామీజీ కి సూపర్ డూపర్ గుడ్ న్యూస్ !

-

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ కి సూపర్ గుడ్ న్యూస్ ఒకటి అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేవుని నమ్మని చాలామంది రాజకీయ నాయకులను తన పాదాల దగ్గర శిష్యులుగా మార్చుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఇద్దరికీ ఆయనంటే ఎంతో ఇష్టమని అందువల్లే వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారని కొంతమంది స్వరూపానంద స్వామి జీ భక్తులు నెటిజన్లు చేసిన కామెంట్లకు రిప్లై ఇస్తున్నారు. దీంతో స్వరూపానంద స్వామి జీకి బాగా గిరాకీ పెరిగిందని చాలా రాష్ట్రాల నుండి వివిధ పార్టీల రాజకీయ నేతలు శారదా పీఠం బయట ఉదయాన్నే క్యూ కడుతున్నారని వార్తలు ప్రస్తుతం వినబడుతున్నాయి. అయితే చాలా వరకూ వీళ్లలో ఎక్కువ వైసీపీ పార్టీకి చెందిన నాయకులని ఆశ్రమ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

 

ముఖ్యంగా ఏ ఒక్క స్వామి సలహాలు తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్…స్వరూపానంద స్వామి సలహాలు బాగా పాటిస్తారని తేలడంతో త్వరలో రాజ్యసభ ఎన్నికలకు ఈ స్వామిజి సిఫార్సు మేరకు రాజ్యసభలో అడుగుపెట్టాలని భావిస్తున్నారని స్వామీజీకి సూపర్ గుడ్ న్యూస్ అని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఏపీకి నాలుగు రాజ్య సభ సీట్లలో స్వరూపానంద స్వామి జీకి జగన్ ఎన్ని కేటాయిస్తారో చూడాలి.  

Read more RELATED
Recommended to you

Exit mobile version