BREAKING : తెలంగాణ, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

-

BREAKING : తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వాలకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. తాజాగా తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలను తక్షణమే విభజించాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది.

ప్రతివాదులుగా ఉన్న కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. షెడ్యూల్ 9, 10 లోని సంస్థలు 91% తెలంగాణలో ఉన్నాయని, ఆస్తుల విలువ రూ.1,42,601 కోట్లని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంగేనని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version