స్వామి పరిపూర్ణానందపై కేసులు..

-

శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిపై హైదరాబాద్ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లోగల అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇటీవలే హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణ పై పరిపూర్ణానంద స్వామికి కోర్టులో ఊరట లభించి తర్వాత మంగళవారం ఆయన హైదరాబాద్లో అడుగుపెట్టారు. ఈ క్రమంలో పలు చోట్ల భాజపా, వీహెచ్పీ,ఏబీవీపీ, భజరంగ్ దళ్ శ్రేణులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ.. భారీ ర్యాలీని నిర్వహించారు. దీంతో హయత్ నగర్ నుంచి లక్ష్మారెడ్డి పాలెం వరకు వాహనాలు భారీగా నిలిచి పోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే..

పరిపూర్ణనందతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, రాజాసింగ్, శేఖర్ జీ పైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news