సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: SRH ప్లేయర్ అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ …!

-

నిన్నటి నుండి ఇండియాలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ స్టార్ట్ అయింది, అందులో భాగంగా నిర్విరామంగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. టీ 20 ఫార్మాట్ లో జరుగుతున్న ఈ ట్రోఫీ లో యువకులు చెలరేగి ఆడి ఐపీఎల్ పై తమదైన ముద్ర వేయాలని ఉరకలేస్తున్నారు. ఇక తాజాగా ఈ రోజు మ్యాచ్ లలో భాగంగా పంజాబ్ మరియు ఆంధ్ర జట్ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు రికార్డు స్థాయిలో పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మొత్తంలో ఫోర్లు సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఓపెనర్ గా వచ్చిన అభిషేక్ శర్మ మొదటి నుండి సిక్సులతో హోరెత్తించాడు. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో కేవలం 51 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు 9 సిక్సులు ఉండడం గమనార్హం.

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న అభిషేక్ శర్మ ఈ విధమైన ఇన్నింగ్స్ ఆడింది లేదు. ఇప్పుడు ఇతని ఇన్నింగ్స్ చూసిన యాజమాన్యం హ్యాపీ గా ఫీల్ అవుతూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news