T20 World Cup: కాసేపట్లో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్..

-

2024 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా రా. 8 గంటలకు న్యూయార్క్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

ప్రస్తుతం స్టేడియం వద్ద వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఆకాశమంతా మబ్బులతో నిండి ఉండగా మ్యాచు వర్షం అంతరాయం కలిగించకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాత్రి 8 గంటలకు దాయాదుల మధ్య పోరు ప్రారంభం కానుండగా ఆ సమయంలో వర్ష సూచన 15శాతం మేర ఉంది.ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్  ఫేవరేట్ గా దిగుతుంటే.. అమెరికాతో ఓటమి తర్వాత పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version