బల్కంపేట టెంపుల్ కు వచ్చినంత… మంది, మోడీ సభకు రాలేదు – తలసాని

-

మోడీ సభపై మంత్రి తలసాని విమర్శలు చేశారు. బీజేపీ కేంద్రం ఏమిచ్చిందో శ్వేతా పత్రం ఇవ్వాలని.. తెలంగాణ లో టెంపుల్స్ గురించి మాట్లాడారన్నారు. దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలి… ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటికి ఇంకా సందిడ్గం కొనసాగుతోందని పేర్కొన్నారు.

సింగిల్ ఇంజన్ సర్కార్ తోనే అన్నీ అభివృద్ధి చేస్తున్నామని.. మీ డబుల్ ఇంజన్ సర్కార్ లో ఏ రాష్ట్రాల్లో అభివృద్ధి సాగుతోందని పేర్కొన్నారు. మేము చేసిన అభివృద్ధి మీ పాలిత రాష్ట్రాల్లో అమలు అవుతుందా అని నిలదీశారు.

నిన్న బీజేపీ సభలో మా బల్కంపేట టెంపుల్ కి వచ్చిన మంది రాలేదని… సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకి మోడీ ఒక్క సమాధానం ఇవ్వలేదని.. టెక్స్ట్ టైల్ పార్క్ అన్నారు ఇచ్చారా అని నిలదీశారు. కోచ్ ఫేక్టరీ ఇచ్చారా.. అమిత్ షా కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని ఫైర్‌ అయ్యారు.
బీజేపీ ని బలోపేతం చేయలనంటే ఇక్కడ కేంద్రం ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వాలి కదాఅని.. దేశం నుండి బీజేపీ ప్రభుత్వం పోవాలని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version