ప్రధానితో వేదిక పంచుకోవటానికి పవన్ కళ్యాణ్ కు అర్హత లేదు – రోజా

-

ప్రధానితో పాటు వేదిక పంచుకోవటానికి పవన్ కళ్యాణ్ కు ఎలాంటి అర్హత లేదని చురకలు అంటించారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా. అల్లూరి సీతారామరాజు 125 జయంతోత్సవాల సమయంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉండటం నా అదృష్టమని.. ఇవాళ దేశం అంతా అల్లూరి ధైర్య సాహసాలు, త్యాగం గురించి గుర్తు చేసుకుంటోందని పేర్కొన్నారు.

దేశ ప్రధాని స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విషయమని.. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో అల్లూరి 125 వ జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అన్నట్లు ఉంది చంద్రబాబు హడావిడిగా ఉందని.. ఇప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తున్నాడని నిప్పులు చెరిగారు.

తాను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజూ కనీసం ఒక ఊరికి కూడా అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలన్న ఆలోచన చేయలేదని.. అధికారంలో ఉన్నప్పుడు అశోక్ గజపతి రాజు, అధికారం లేనప్పుడు చంద్రబాబుకు అల్లూరి సీతారామరాజు గుర్తుకు వస్తారని చురకలు అంటించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి గౌరవించుకుందన్నారు రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version