కేటీఆర్ యూత్‌ ఐకాన్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

-

తెలంగాణ రాష్ట్ర యువనేత, కెసిఆర్ తనయుడు కేటీఆర్ ప్రపంచ యూత్ ఐకాన్ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం నాడు మంత్రి కేటీఆర్ జన్మదినం కానుకగా సిరిసిల్ల అభివృద్ధిపై రూపొందించిన డాక్యుమెంటరీని నేడు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ నేతలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమితి వాటికి సంబంధించిన పలువురు నేతలు హాజరయ్యారు.

ktr-talasani

ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… అతి తక్కువ సమయంలోనే కేటీఆర్ ఐటీ మంత్రిగా తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాడని కొనియాడారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఎక్కువగా ఉన్నపటికీ, కేటీఆర్ వైరస్ ను లెక్కచేయకుండా నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రమంతా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర పురోగతిలో ప్రకృతి, దేవుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకులు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తలసాని ఈ కార్యక్రమం ద్వారా ప్రతిపక్షాల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version