గవర్నమెంట్ బస్సులో ప్రయాణించిన తమిళనాడు సీఎం స్టాలిన్

-

తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు.మెరీనా బీచ్ లో ఉన్న కరుణానిధి స్మారకం, అన్నా మెమోరియల్ కు చేరుకునేందుకు స్టాలిన్ బస్సులో ట్రావెల్ చేశారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి ఏడాది కాలం ముగిసిన సందర్భంగా ఆయన ప్రభుత్వ బస్సుల పనితీరును తనిఖీ చేశారు. ప్రయాణికులు, కండక్టర్ తో ముచ్చటించారు. బస్సు సౌకర్యాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. మెరీనా బీచ్ కు బస్సులో చేరుకున్న సీఎం స్టాలిన్. అక్కడ ఉన్న మాజీ సీఎం కరుణానిధి స్మారకం వద్ద నివాళి అర్పించారు.

డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ సీఎం సిఎన్ అన్నాదురై మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం తో నివాళి అర్పించారు. ఆ తర్వాత అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ఐదు కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లల కోసం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను ప్రకటించారు. స్కూల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్, మెడికల్ చెకప్, పట్టణ కేంద్రాల్లో పీహెచ్ సి ల ఏర్పాటుపై ప్రకటన చేశారు. అన్ని నియోజకవర్గాల్లో సీఎం అన్న స్కీమ్ ను కూడా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news