వణుకుతోన్న తమిళనాడు.. రేపు సెలవు ప్రకటన

-

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపాను‌గా మారింది. ఈ తుపాన్ పేరు నివర్‌ గా నామకరణం చేసారు. వాయుగుండం ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. రాగల 12 గంటల్లో వాయుగుండంగా,తదుపరి 24 గంటల్లో తీవ్ర తుఫాన్ గా నివర్ మారనుంది. ఇది రేపు సాయంత్రం తమిళనాడులోని మామల్లపురం- కరైకల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడు సహా దక్షిణ కోస్తా,రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను కారణంగా కడల్లోర్, విల్లుపురం, పుదుచ్చేరి తదితర తీరప్రాంత జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు నీరు చొచ్చుకువచ్చే అవకాశం ఉంది. తమిళనాడు తీరంలో ముందు జాగ్రత్త చర్యగా రెండు కొస్ట్ గార్డ్ నౌకలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు మోహరించారు. నవంబర్ నెలలో తుఫాను గండం పొంచి ఉండటంతో అక్కడ జనం వణికిపోతున్నారు, రేపు అక్కడ సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news