ఏపీ స్పీకర్ కు తప్పిన పెను ప్రమాదం !

-

స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు పెను ప్రమాదం తప్పింది. రాగోలు-పంజంగి మధ్యలో ఆముదాలవలస మండలం వాకలవలస తమ్మినేని కాన్వాయ్‌ కి ఓ ఆటో అడ్డురావడంతో ఆటోను స్పీకర్ తమ్మినేని వాహనం ఢీ కొట్టింది. ఇక ఆటోను తప్పించబోయి స్పీకర్ కాన్వాయ్ లోని మరో కారు పొలాల్లోకి దూసుకెళ్లిన ట్టు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న తర్వాత తిరుగు ప్రయాణమైన స్పీకర్ కాన్వాయ్‌ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారును ఢీకొని బోల్తా పడిన ఆటో లో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కారులోంచి దిగిన స్పీకర్.. గాయపడిన వారిని దగ్గరుండి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలింపజేశారు. ఆయన వేరే వాహనంలో తన ఇంటికి వెళ్ళిపోయారు. ఇక దీంతో భద్రతా బలగాలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అనుకోకుండా ఇలా జరగడంతో టెన్షన్ నెలకొంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version