ఫిలిం నగర్ లో తారక రత్న దిన కర్మ కార్యక్రమం..హాజరైన NTR

-

నటుడు నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల గుండెపోటుకు గురై…మరణించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ కుప్పంలో ప్రారంభించిన యువగలం పాదయాత్రలో తారకరత్న పాల్గొని.. కొద్దిసేపు నడవగానే స్పృహ తప్పి పడిపోయారు. దీంతో పరిస్థితి విషమంగా ఉండడంతో కుప్పం నుండి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి ఆయనను తరలించారు. కానీ ఆయన మృతి చెందారు.

అయితే, ఇవాళ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో తారక రత్న దశ దిన కర్మ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు – పురందరేశ్వరి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news