BREAKING : ఇవాళ మధ్యాహ్నం తారక రత్న అంత్యక్రియలు

-

తారకరత్న మరణాన్ని ఆయన కుటుంబసభ్యులు.. అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు నటుడిగా కొనసాగుతూనే.. రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొన్న తమ అభిమాన హీరో ఇకలేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. ఆయన మృతి ప్టల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే బాలకృష్ణ, చిరంజీవి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆయన ఇంటికి చేరుకుని తారకరత్న పార్థివదేహానికి నివాళులు అర్పించారు. నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం తనను ఎంతగానో బాధించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. తారకరత్న చాలా మంచి వ్యక్తి అని, సినీ రంగంలో ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారని తెలిపారు. తారకరత్న అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news