కొడాలి నానికి షాక్‌..క్యాసినోపై ఈడీకి టీడీపీ ఫిర్యాదు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి ఊహించని షాక్‌ తగిలింది. తెలుగు దేశం పార్టీ కేసినో వ్యవహారాన్ని అస్సలు వదిలి పెట్టేలా కనిపించడం లేదు. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి గుడివాడ కేసినో వ్యవహారాన్ని తెలుగు దేశం పార్టీ తీసుకువచ్చింది. ఈ మేరకు ఈడికి క్యాసినో వ్యవహారంపై ఫిర్యాదు చేశారు తెలుగుదేశం నేతలు.

కాసేపటి క్రితమే… ఈడి అధికారులను కలిసిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్… మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. గుడివాడ కేసినో వ్యవహారాన్ని అస్సలు వదులకూడదని.. దీనిపై సమగ్రంగా విచారణ చేయాలని ఈడీ అధికారులను కోరారు. ఇక తెలుగు దేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును ఈడీ అధికారులు కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇక త్వరలోనే.. గుడివాడ కేసినో వ్యవహారంపై ఈడీ అధికారులు విచారణ కూడా చేపట్టే ఛాన్స్‌ కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version