టికెట్ దక్కక పోవడంతో ఆత్మహత్యాయత్నం చేసిన టీడీపీ ఇన్ ఛార్జ్

-

మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి.ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ 7 జాబితాలను విడుదల చేయగా ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూడా ఉమ్మడి అభ్యర్థులను చేసింది. తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను, జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు.

మొత్తం ఫస్ట్ లిస్ట్ లో మొత్తం118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ,అందులో కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ప్రభాకర్ పేరు లేదు.దీంతో ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. పార్టీ టికెట్ తనకు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై పురుగులమందు తాగారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చంద్రబాబు తమకు న్యాయం చేయాలని ప్రభాకర్ భార్య కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవల విడుదల చేసిన జాబితాలో కోడుమూరు టికెట్ బొగ్గుల దస్తగిరికి దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news