జగన్ నరహంతకుడు, పరిటాల హత్యకేసు సాక్షులు బతికే ఉన్నారా…?

-

జగన్మోహన్ రెడ్డి నరహంతుకుడు, పరిటాల రవి హత్యకేసులో సాక్ష్యులందరు బ్రతికి ఉన్నారా? వీళ్లు చేసే దొంగ పనులకు సాక్ష్యాలు కూడా లేకుండా చేస్తున్నారు” అంటూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాసేపటి క్రితం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దండుపాళ్యం, స్టువర్ట్ పురం దొంగలు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రే అని తనపై సారధి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మేము చేసిన అవినీతి ఆరోపణలుపై సమాధానం చెప్పకుండా పార్థసారథి టీడీపీ పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

పార్థ సారధి పెద్ద అవినీతి పరుడని, నువ్వు చేసిన అవినీతి నీ పక్కన ఉన్న నాయకుడే నాకు చెప్పాడని, తాడిగడప బ్రిడ్జి మంజూరు చేయాలంటే నీకు స్థలం ఇవ్వాలని ఆయన చేసిన విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. పార్థసారథి వేల కోట్ల దోచుకున్నాడని ఆరోపించారు. నన్ను కానీ మా అధినేత చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని ఆరోపించారు. నువ్వు అవినీతి చేయలేదని తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయి అంటూ సవాల్ విసిరారు. దళితుల మీద ప్రేమ ఒలకబోస్తన్న పార్థసారధి దళితులకు ఎందుకు ఇల్లు ఇవ్వలేదని నిలదీశారు.

నీకు దమ్ముంటే మీడియా సమక్షంలో నాకు ఈ భూముల నుండి ఏక్కడ రూపాయి అందలేదు అని ప్రమాణం చేస్తావా? అని సవాల్ విసిరారు. తాడిగడప – బందరు రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి న్యాయం చేయాలనిభావించా అన్నారు. లక్షల రూపాయలు తీసుకొన్నానని నాపై ఆరోపణలు చేశారని, దళిత రైతులు కూర్చోపెట్టి ఇల్లు కోల్పోయిన వారితో మాట్లాడించి స్థలాలు ఇచ్చామని పేర్కొన్నారు. నీకు దమ్ముంటే వీరందరినీ పిలిపించి చర్చిద్దామని పట్టపగలే కొంపలు దోచుకునే దొంగలు మీరు అంటూ ఆగ్రహంగా వ్యాఖ్యలు చేసారు. నాకు ఎకరా 50 సెంట్లు భూమి ని నా కూతురికి కట్నం గా ఇచ్చాను అన్నారు. ఇంతకన్నా నాకు ఒక్క ఎకరా వ్యవసాయ భూమి ఉన్న నేను పేదలకు ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నాను అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version